2022లో వచ్చిన గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాల తర్వాత హీరోయిన్ రాశీఖన్నా(RaashiikKhanna )నుంచి మరో తెలుగు సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్గా చేస్తున్నారు రాశీఖన్నా. ఇందులో శ్రీనిధిశెట్టి మరో హీరోయిన్. స్టైలిస్ట్ నీరజకోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా డిసెంబరు 17న రిలీజ్ కానుంది. అయితే తాజాగా రాశీఖన్నా తెలుగులో మరో కొత్త సినిమాకు సైన్ చేసింది.
Team #UstaadBhagatSingh welcomes the angelic #RaashiiKhanna on board as ‘Shloka’ ✨
She brings her grace and charm to the sets ❤️
Shoot underway.POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #UjwalKulkarni @MythriOfficial @SonyMusicSouth @UBSthefilm pic.twitter.com/2PsPTq5rLj
— Mythri Movie Makers (@MythriOfficial) July 22, 2025
పవన్కల్యాణ్ హీరోగా హరీష్శంకర్ డైరెక్షన్లో ‘గబ్బర్సింగ్’ సినిమా తర్వాత మళ్లీ ‘ఉస్తాద్భగత్సింగ్’ అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా శ్రీలీల యాక్ట్ చేస్తుండగా, మరో హీరోయిన్గా రాశీ ఖన్నాను తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో శ్లోక అనే పాత్రలో కనిపిస్తారు రాశీఖన్నా. ఆల్రెడీ ఆమె షూటింగ్లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా విడుదల కావొచ్చు. ఈ చిత్రంలో పవన్కల్యాణ్ పోలీసాఫీసర్గా చేస్తున్నాడు. తమిళ హిట్ విజయ్ ‘తేరీ’ సినిమాకు తెలుగు రీమేక్గా, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారట.
ఇలా ప్రజెంట్ రాశీఖన్నా తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆసక్తికరంగా ఈ రెండు సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండగ, వారిలో ఒకరిగా రాశీ చేస్తున్నారు. మరి..భవిష్యత్లో ఆమె సోలో హీరోయిన్గానూ, సినిమా చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.