Chiranjeevi157: నాని ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). ‘దసరా’ సిని మా బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో తన నెక్ట్స్ మూవీ ‘ప్యారడైజ్’ను కూడా నానితోనే చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ రెండు సినిమాలకు నిర్మాత ఒకరే. అతనే సుధాకర్ చెరుకూరి. 2025లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
చిరంజీవి(Chiranjeevi157)కి శ్రీకాంత్ ఓదెల డైహార్డ్ ఫ్యాన్. తనకు సినిమా అంటే చిరంజీవియే అన్నట్లుగా పలు సందర్భాల్లో మాట్లాడు కూడా. అయితే ఇటీవల చిరంజీవిని కలిసి, ఓ కథ వినించారు శ్రీకాంత్ ఓదెల. చిరంజీవికి కూడాఈ కథ నచ్చింది. ఆల్మోస్ట్ సినిమా ఒకే అయిపోయినట్లే.
ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠతో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ చిత్రం తర్వాత తనతో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేసిన, మోహన్రాజాతో మరో సినిమా చేస్తారు చిరంజీవి. ఈ సినిమా పూర్తయిన తర్వాతశ్రీకాంత్ ఓదెలతో సినిమాను సెట్స్పైకి తీసుకు వెళ్లొచ్చు. ఈ లోపు నానితో శ్రీకాంత్ కూడా ‘ప్యారడైజ్’ సినిమాను పూర్తి చేస్తాడు. 2025 చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. 2026 చివర్లో రిలీజ్ ఉండొచ్చు.