ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’ సినిమా సీక్వెల్ ‘కల్కి2898 ఏడీ2 (కల్కి 2)’ నుంచి దీపికా పదుకొనెను (deepika padukone out from kalki2) తప్పించినట్లుగా ఈ సినిమా మేకర్స్ గురువారం అధికారికంగా వెల్లడించారు. ప్రభాస్, అమి తాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రధారలుగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన సినిమా ‘కల్కి 2898ఏడీ’. ఈ సోషియో ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమాను అశ్వనీదత్ నిర్మించారు. 2024 జూన్ 27న విడుదలై, ఈ సినిమా సూపర్డూపర్ హిట్గా నిలిచింది.
అప్పట్నుంచి ఈ సినిమా సీక్వెల్పై వర్క్ చేస్తున్నారు నాగ్అశ్విన్. ‘కల్కి2898 ఏడీ’ సినిమా సీక్వెల్ షూటింగ్ ను ఈ ఏడాది చివర్లో స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా, నాగ్ అశ్విన్ ఇటీవల ఓ సందర్భంగా వెల్లడించారు. ఈ తరుణంలో ‘కల్కి 2’లో ప్రధానమైన పాత్ర చేస్తున్న దీపికా పదుకొనెను మేకర్స్ తప్పించడం ఇటు టాలీవుడ్లోనూ, అటు బాలీవుడ్లోనూ చర్చనీయాంశమైంది (deepika padukone out from kalki2).
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025
మరోవైపు ప్రభాస్ హీరోగా సందీప్రెడ్డి వంగా డైరెక్షన్లో దీపికా పదుకొనె హీరోయిన్గా చేయాల్సింది. కానీ ‘స్పిరిట్’ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ అంటూ, అధికారిక ప్రక టన రాకముందే, ఈ సినిమాను దీపికా పదుకొనె తప్పుకున్నారు. ఈ ప్లేస్లో త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు మేకర్స్. కానీ దీపికను ఉద్దేశిస్తూ, సందీప్రెడ్డి వంగా పరోక్షంగా ఎక్స్లో చేసిన ట్వీట్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.
ఈ విషయాలు ఇలా ఉంచితే…‘కల్కి 2’ (Kalki2) సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు దీపికా పదుకొనె (Deepika Padukone) ఎక్కువ రెమ్యూనరేషన్ను డిమాండ్ చేసిందని, పైగా తన కాల్షీట్ కేటాయించిన రోజు..కేవలం ఏడు గంటలు మాత్రమే వర్క్ చేస్తానని దీపికా చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు .. దీపిక పదుకొనె టీమ్ పాతికమంది ఉంటారని, ఈ 25 మందికి నిర్మాతలే డబ్బు చెల్లించాలని దీపిక అడుగుతున్నారనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ షరతుల వల్లే ‘స్పిరిట్’, ‘కల్కి2’ సినిమాల్లో దీపికా పదుకొనెను ఆయా చిత్రాల మేకర్స్ తప్పిం చారనే ప్రచా రం జరుగుతోంది.
ఇక దీపికా పదుకొనె తప్పుకున్న రెండు పెద్ద సినిమాల్లోనూ ప్రభాస్యే హీరో కావడం విశేషం. ఇక దీపికా పదుకొనె భర్త రణ్వీర్సింగ్… దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేయాల్సిన ‘బ్రహ్మారాక్షస’ సినిమా క్యాన్సిలైంది. ఈ సినిమాను ప్రభాస్ చేస్తారనే ప్రచారం జరుగుతుండటం మరో ఆసక్తికరమైన విషయం.
ఇక ప్రస్తుతం షారుక్ఖాన్ ‘కింగ్’ సినిమా చిత్రీకరణ కోసం పోలాండ్లో ఉన్నారట దీపికా పదుకొనె. ఆ నెక్ట్స్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సెట్స్లో దీపిక పాల్గొంటారు. అక్టోబరులో ఈ సినిమా కొత్త షెడ్యూల్ అబుదాబిలో ప్రారంభం కానుంది.