Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించవచ్చు. గత కొన్నాళ్లుగా ఊరిస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
నిజానికి వీరిద్దరూ కలిసి పనిచేయాలని గతంలోనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చర్చలు కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా రేంజ్ పూర్తిగా మారిపోయింది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ చిత్రాలతో తన మార్క్ చూపించిన ఆయన, ‘యానిమల్’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించారు. హీరో క్యారెక్టరైజేషన్ను అత్యంత ఇంటెన్స్గా చూపించే వంగా, మహేష్ బాబు వంటి పర్ఫెక్ట్ యాక్టర్తో సినిమా తీస్తే అది రికార్డుల వేట సాగించడం ఖాయం. ప్రస్తుతం ఈ ఇద్దరు దిగ్గజాలు తమ తమ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అడ్వెంచర్ విజువల్ వండర్ ‘వారణాసి’ షూటింగ్లో మహేష్ నిమగ్నమై ఉన్నారు. ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమాను పట్టాలెక్కించే పనిలో వంగా ఉన్నారు. అయితే, రాజమౌళి సినిమా పూర్తయ్యే సమయానికి సందీప్ వంగా కూడా తన కమిట్మెంట్స్ ముగించుకుంటారని, ఆ తర్వాతే ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, 2027లో ఈ సెన్సేషనల్ కాంబోపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.
మహేష్ బాబు అంటే క్లాస్, మాస్ ప్రేక్షకులను సమానంగా మెప్పించగల హీరో. కానీ సందీప్ వంగా సినిమాల్లో హీరోలు రా గా, ఎమోషనల్గా చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే, మహేష్ బాబును మనం ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త ఇంటెన్స్ రోల్లో చూసే అవకాశం ఉంటుంది. అభిమానులు కూడా తమ ‘సూపర్ స్టార్’ను వంగా మార్క్ యాక్షన్ డ్రామాలో చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ కలయిక నిజమైతే టాలీవుడ్లో మరో ఇండస్ట్రీ హిట్ పడటం గ్యారెంటీ.