హీరోయిన్ సమంత కొత్త చిత్రానికి ‘శుభం’ (Samantha Tralala Moving pictures Shubam) అనే టైటిల్ ఖరారైంది. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. కానీ ఇక్కడ అసలు…విషయం ఏంటంటే…శుభం సినిమాలో సమంత మెయిన్ లీడ్ రోల్ చేయలేదు. ఓ గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. అలాగే సమంత సొంత నిర్మాణసంస్థ ‘ట్రా లా లా పిక్చర్స్’ పతాకంపై వస్తున్న తొలి చిత్రం ఇది. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి…లా అంతా..నూతన తారాగణం ‘శుభం’ సినిమాలో యాక్ట్ చేశారు. ‘సినిమా బండి’తో ఫర్వాలేనదిపించిన దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈ మూవీకి దర్శకుడు. వసంత్ మరిగంటి ఈ సినిమాకు కథ అందించారు.
త్వరలోనే విడుదల
ఈ శుభం సినిమా విడుదలకు సిద్ధంమైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విడుదల తేదీపై త్వరోలనే ఓ అప్డేట్ రావొచ్చు. అయితే..అనుపమా పరమేశ్వరన్తో ఆల్రెడీ ప్రవీణ్ ‘పరదా’ అనే మూవీ చేశాడు. ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. మరి..శుభం ముందు రిలీజ్ అవుతుందా? లేక ‘పరదా’ మూవీ రిలీజ్ అవుతుందా? అనేది చూడాలి.
సమంత సినిమా ఆగియిపోయినట్లేనా!
నిజానికి ‘ట్రా లా లా పిక్చర్స్’ బ్యానర్లో అనౌన్స్చేయబడిన తొలి చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రకటించారు. కానీ ఇప్పుడు ..ట్రాలాలా పిక్చర్స్ తొలి సినిమాగా ‘శుభం’ రిలీజ్ కాబోతుంది అంటున్నారు. దీన్ని బట్టి…‘మా ఇంటి బంగారం’ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో ‘రక్త్బ్రహ్మాండ’ అనే హిందీ వెబ్సిరీస్ మాత్రమే ఉంది.
ఇక ఈ ప్రాజెక్ట్ కొన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య చిక్కుకున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.