‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వత హీరో వెంకటేష్ నెక్ట్స్ మూవీపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఈ గ్యాప్లో చాలా కథలనే విన్నారు వెంకటేష్. కానీ…‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ తర్వాత ఆ రేంజ్లో మరో హిట్ కొట్టాలంటే..టాప్ డైరెక్టర్తోనే వెంకీ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ దిశగా వెంకటేష్ కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నారు. కథలు వింటున్నారు.
అయితే వెంకటేష్ (Venkatesh)–త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో మూవీ అంటూ ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వెంకటేష్ హీరోగా ఓ మూవీ చేయాల్సి ఉంది. ఈ బ్యానర్కు చాలా క్లోజ్గా ఉంటుంటారు దర్శకుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ కెరీర్లోని మేజర్ సినిమాల్లో ఈ బ్యానర్ భాగమైఉంది. సో…హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వెంకటేష్ మూవీ అనగానే, ఈ చిత్రానికి త్రివిక్రమ్యే డైరెక్టర్ అని అందరు ఫిక్స్ అయ్యారు. కానీ..ఎందుకో..ఈ మూవీ ఓ పట్టాలెక్కడం లేదు. అయితే ఆ తరుణం ఇప్పుడు వచ్చిందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

అల్లు అర్జున్తో త్రివిక్రమ్ ఓ మూవీ చేయాలి. కానీ అల్లు అర్జున్ మాత్రం తమిళ దర్శకుడు అట్లీతో ముందుకెళ్లిపోయారు. దీంతో త్రివిక్రమ్…హీరో వెంకటేష్కు షిప్ట్ అయినట్లుగా తెలుస్తోంది. వెంకటేష్ –త్రివిక్రమ్ కాంబినేషన్లోని మూవీపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపైనే ఈ మూవీ ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
గతంలో వెంకటేష్ హీరోగా చేసిన బ్లాక్బస్టర్ మూవీస్ ‘మల్లీశ్వరి, నువ్వునాకునచ్చావ్’ సినిమాకు త్రివిక్రమ్ రైటర్గా చేశారు. ఇప్పుడు..వీరి కాంబినేషన్లో మూవీ అంటే ఆడియన్స్లో కచ్చితంగా అంచనాలు ఉంటాయి. ఇక ఈ సినిమాకు తమన్ను మ్యూజిక్ డైరెక్టర్గా అనుకుంటున్నారట మేకర్స్. ఈ సినిమాను గురించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం.