పవన్కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహరవీరమల్లు’ చిత్రం ఈ జూన్ 12న థియేటర్స్లో రిలీజ్కు రెడీ అవుతోంది. జాగర్లమూడి రాధాకృష్ణ, ఈ చిత్రం నిర్మాత ఏఎం. రత్నం తనుయడు, దర్శ కుడు జ్యోతికృష్ణలు…‘ఈ హరిహరవీరమల్లు’ సినిమాకు దర్శకత్వం వహించారు. పరోక్షంగా దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకు వర్క్ చేశారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపి స్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ‘హరిహరవీరమల్లు’ సినిమా నుంచి ‘తార తార నా కళ్లు..’ ( ‘Taara Taara’ from Hari Hara Veera Mallu ) అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఇది. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి. శ్రీహర్ష ఇమాని లిరిక్స్ అందించారు. లిప్సిక భాష్యం, ఆదిత్యా ఐయ్యంగార్లు పాడారు.
17వ శతాబ్దంలో సాగే ఈ ‘హరిహరవీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాను ఏఏమ్ రత్నం, అద్దంకి దయాకర్లు నిర్మించారు. రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. తొలిభాగం ‘హరిహర వీరమల్లు:స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మూవీ జూన్ 12 (Hari Hara Veera Mallu Release date)న థియేటర్స్లో రిలీజ్ కానుంది.

ఈ తొలి భాగం విజయంపై మలిభాగం ఉంటుందా?లేదా? అనే విషయంపై ఓ క్లారిటీ వస్తుంది. బాబీ డియోల్, నాజర్, అనసూయ, వెన్నెల కిశోర్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో ‘హరిహరవీరమల్లు’ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.