దర్శకుడు సుకుమార్ (Director Sukumar) తెలుగు చలనచిత్రపరిశ్రమలోని అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకరు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇటీవల ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప: ది రూల్’ సినిమాతో ఆయ న పేరు, పాపులారిటీ ఇంకా పెరిగింది. అయితే సుకుమార్ నోట మరోసారి రిటైర్మెంట్ మాట వినిపించడం మాత్రం ఆయన ఫ్యాన్స్ను బాధపెడుతోంది.
‘పుష్ప: ది రూల్’ ప్రీమియర్ షోను డిసెంబరు 4న అర్థరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ప్రద ర్శిం చగా, తొక్కిసలాట జరిగి, ఒకరు మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఈ ఘటన నుంచి దర్శకుడు సుకుమార్ ఇంకా బయటకు రాలేక పోతున్ట్లున్నారు. రిటైర్మెంట్ అంటూ మాట్లాడుతున్నారు.
రామ్చరణ్ ‘గేమ్చేంజర్’ (Ramcharan Gamechanger) సినిమా ఫంక్షన్ అమెరికాలో జరిగినప్పుడు, యాంకర్ సుమ ఓ ప్రశ్నను సుకుమార్ని అడిగారు. దూప్ (గేమ్చేంజర్లోని దూప్ సాంగ్ లాంచ్) అంటూ ఏం వదిలేస్తారు అంటూ…సినిమాలను వదిలే స్తానని సుకుమార్ (Director Sukumar) చెప్పేశాడు. వెంటనే సుకుమార్ పక్కన ఉన్న రామ్చరణ్ అదేం లేదంటూ మాట్లాడారు.
కానీ మళ్లీ ఇప్పుడు…ఉపేంద్ర అన్న కుమారుడు నిరంజన్ (Niranjan), యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ (AiswaryaArjun)లు లీడ్ రోల్స్లో నటించిన ‘సీతా పయనం’ (Seetha Payanam Movie Teaser) సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. అర్జున్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ ఈవెంట్కు దర్శకుడు సుకు మార్, ఉపేంద్రలు అతిథులుగా హాజరైయ్యారు. ఈ వేడుకలో సుకుమార్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉపేంద్ర తీసిన ‘ఉపేంద్ర, ఏ, ఓం..’ వంటి సినిమాల నుంచి తాను స్పూర్తి పొందానని, ఆ మూడు సినిమాలు తీసి డైరెక్టర్గా రిటైర్ అపోపోవచ్చని, తానైతే రిటైర్ అయి పోయేవాడినని మాట్లాడారు. అలా సుకుమార్ నోట మరోమారు రిటైర్మెంట్ మాట రావ డం ఆయన అభిమానులకు ఆలోచనలో పడేస్తుంది.
ఇక ‘సీతాపయనం’ (Seetha Payanam Teaser) సినిమాలో లీడ్ యాక్టర్గా నటించిన ఐశ్వర్యా అర్జున్, నిరంజన్లకు ఈ సినిమా తెలుగులో తొలి సినిమా. ఈ చిత్రం కన్నడంలో కూడ రూపొందుతోంది. ఈ మూవీలో అర్జున్, ధ్రువా సర్జాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీపై త్వరలోనే ఓ ప్రకటన రానుంది.
ఇక ఈ సీతాపయనం (SeethaPayanam) సినిమా కోసమే అర్జున్…గతంలో విశ్వక్సేన్ను అప్రోచ్ అవ్వగా, కొన్ని కారణాల వల్ల విశ్వక్సేన్ తప్పుకున్నాడు. విశ్వక్ ప్లేస్లోనే ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ను తీసుకున్నారు.
ఇక సుకుమార్ నెక్ట్స్ మూవీ రామ్చరణ్ (Ramcharan)తో తీయనున్నారు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత, దర్శకుడు సుకుమార్– హీరో రామ్చరణ్ల కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ (RC17) పై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీమూవీమేకర్స్ సంస్థయే, రామ్చరణ్–సుకుమార్ల కాంబినేషన్లోని సినిమానూ నిర్మించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు.
Mirai Teaser: తొమ్మిది పుస్తకాలు..వంద ప్రశ్నలు..వన్ స్టిక్