మహేశ్బాబుకు (Maheshbabu Holiday) లాంగ్ బ్రేక్ దొరికింది. దాదాపు నెల రోజులకు పైగా హాలీడే చాన్స్ దక్కింది. మహేశ్బాబు ప్రజెంట్ రాజమౌళితో SSMB29 మూవీ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. మహేశ్బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లు పాల్గొనగా, ఓ ఫైట్, ఓ సాంగ్ తీశారు. గురవారంతో సాంగ్ షూటింగ్ చిత్రీకరణతో ఈ హైద రాబాద్ షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ కెన్యా లేదా కాశీ సెట్లో ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్లోనే కాశీ నగరాన్ని తలపించేలా ఓ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ వర్క్ పూర్తయితే, ఈ మూవీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. లేకపోతే..టీమ్ కెన్యాకు వెళ్లే చాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ మూవీ SSMB29 నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి నెల రోజుల సమయం ఉంది. దీంతో ఫ్యామిలీస్తో కలిసి ఫారిన్కు వెళ్లాలనుకుంటున్నారట మహేశ్బాబు. పది రోజుల గ్యాప్ దొరికితే..ఫారిన్ ట్రిక్కు వెళ్లొచ్చే మహేశ్బాబు..నెల రోజుల గ్యాప్ దొరికితే ఊరుకుం టారా..ఫ్లైట్ ఎక్కేస్తారు.
ఈ గ్యాప్లో లండన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రదర్శన ఉంది. అక్కడికి ఎన్టీఆర్, రామ్ చరణ్,రాజమౌళి, కీరవాణి వెళ్లాల్సి ఉంది. ఇలా… మహేశ్బాబు ఫారిన్కి, రాజమౌళి లండన్కి వెళ్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్ను స్టార్ట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది. 2027 స్టార్టింగ్లోనే ఈ మూవీ రిలీజ్ కావొచ్చు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్తో కలిసి ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నారు దేవకట్టా. ప్రపంచాన్ని చూట్టేసే ఓ సాహసవంతుడి నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని, నిధి అన్వేషణ ప్రధానమని ప్రచారం సాగుతోంది.