please subscribe to Tollywoodhub YouTube channel

సమంత బాటలో నిత్య మేనన్.. హీరోయిన్ నుంచి నిర్మాతగా..!

Kumar NA
1 Min Read

Web Stories

Nithya Menen Turns Producer, Launches Keyuri Productions :దక్షిణాది సినీ పరిశ్రమలో అద్భుతమైన నటనతో వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న జాతీయ ఉత్తమ నటి నిత్యామేనన్, తాజాగా తన సినీ ప్రస్థానంలో సరికొత్త మలుపు తీసుకున్నారు. నటిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన ఆమె, ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2026 ఫిబ్రవరి 17న ‘కీయురి ప్రొడక్షన్స్’ అనే తన సొంత బ్యానర్‌ను అధికారికంగా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు.

ఈ పేరు వెనుక ఉన్న లోతైన భావనను వివరిస్తూ.. భూమిలోని గుహల నుంచి ఉద్భవించి, రాయిలా చెక్కబడి, చివరికి కాంతిని తాకుతూ అనంతమైన గమ్యం వైపు సాగే ప్రయాణమే ‘కీయురి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ నిర్మాణ సంస్థ ద్వారా కేవలం వాణిజ్య పరమైన చిత్రాలను రూపొందించడమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని, వారిని ఆలోచింపజేసే బలమైన కథలను ప్రపంచానికి అందించడమే తన ప్రధాన ఆశయమని నిత్య స్పష్టం చేశారు.

కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ, మానవ సంబంధాలు, లోతైన భావోద్వేగాలతో కూడిన కంటెంట్‌కు తమ బ్యానర్ పెద్దపీట వేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. 2024లో ‘తిరు చిత్రంబలం’ సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్న నిత్యామేనన్, ఇప్పుడు బాధ్యతాయుతమైన నిర్మాతగా మారడం ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చిత్ర పరిశ్రమలో మహిళా నిర్మాతల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో, నిత్య తీసుకున్న ఈ నిర్ణయం ఒక సాహసోపేతమైన, ఆదర్శవంతమైన అడుగుగా చెప్పవచ్చు.

 

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi