dhurandhar 2 Ott : బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ మానియా ఇంకా తగ్గనే లేదు. రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు తన సీక్వెల్తో మరింత భారీగా అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ‘ధురంధర్ 2’ అధికారిక పోస్టర్, టీజర్ను విడుదల చేసిన చిత్ర బృందం, సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. అయితే, ఈ సీక్వెల్కు సంబంధించి ఒక ఆసక్తికరమైన మార్పు బాలీవుడ్లో చర్చనీయాంశమైంది (dhurandhar 2 Ott).
సాధారణంగా ఒక సినిమా మొదటి భాగం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో, రెండో భాగం కూడా అక్కడే వస్తుంది. కానీ ‘ధురంధర్’ విషయంలో సీన్ మారింది. మొదటి భాగం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉండగా, ‘ధురంధర్ 2’ డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ భారీ ధరకు దక్కించుకుంది. గ్లోబల్ రీచ్తో పాటు మార్కెటింగ్ పరంగా జియో హాట్స్టార్ ఇచ్చిన భారీ ఆఫరే ఈ మార్పుకు కారణమని సమాచారం. ఈ సీక్వెల్లో కేవలం రణ్వీర్ సింగ్ మాత్రమే కాదు, ఒక భారీ తారాగణమే ఉంది. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రామ్పాల్ మరియు సారా అర్జున్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈసారి యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండబోతున్నాయని, కథలో సస్పెన్స్ మరింత గ్రిప్పింగ్గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో #Dhurandhar2 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం, ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాతే ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ టోన్ చూస్తుంటే, పార్ట్-1 కంటే పార్ట్-2 బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.