బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి (EmraanHashmi) కి తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దగా కలిసొచ్చినట్లుగా లేదు. ఇమ్రాన్ హష్మి ప్రజెంట్ అడివి శేష్ ‘గూఢచారి 2’, పవన్కల్యాన్ ‘ఓజీ’ సినిమాలు చేస్తున్నాడు. అయితే ‘గూఢచారి 2 (Gudachari2 G2)’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ఇమ్రాన్ హైదరాబాద్ వచ్చి, ఓ యాక్షన్ సీక్వెన్స్లో భాగంగా తీవ్రగా గాయపడ్డాడు. దీంతో హాస్పిటల్కు వెళ్లి, ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ముంబైలో తిరిగి ‘గూఢచారి 2’ సిని మా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఇది గత ఏడాది అక్టోబరులో జరిగింది.
ప్రస్తుతం పవన్కల్యాణ్ (Pawankalyan) ‘ఓజీ’ (OG Movie)సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాడు ఇమ్రాన్హష్మి (Emranhaashmi Health). కానీ అనూహ్యంగా ఇమ్రాన్ అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇమ్రాన్కు డెంగ్యూ సోకిందనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఓజీ సినిమా షూటింగ్కు తాత్కలికంగా బ్రేక్ పడింది. మరో విశేషం ఏంటంటే…ప్రస్తుతం పవన్కల్యాణ్–ఇమ్రాన్ల మధ్య సన్నివేశాలను తీస్తున్నారట. ఈ తరుణంలో ఇమ్రాన్కు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు 27న విడుదల కావాల్సిన ఓజీ సినిమా రిలీజ్పై ఇది ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఏదీ ఏమైనా..ఇమ్రాన్హష్మికి టాలీవుడ్ ఎంట్రీ కాస్త ఇబ్బందికరంగానే మారినట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్లో మర్డర్, మర్డర్2, రష్, టైగర్ 3 …వంటి సినిమాలతో ఇమ్రాన్ హష్మి మంచి నటుడిగానే పేరు తెచ్చుకున్నారు. మొదట్లో హీరోగా చేసిన ఈ నటుడు, మెల్లిగా విలన్ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాడు.