మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీ స్టోరీ ఇదేనా?

SSMB29 Story: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీ రామాయణంలోని సంఘటనల స్ఫూర్తితో, కాశీ నేపథ్యంతో ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

Viswa
1 Min Read
MaheshBabu 2025 Latest Photo

హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని గురించి రోజుకో అంశం తెరపైకి వస్తుంది (MaheshBabu SSMB29 Movie Story). ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ఈ మూవీ ప్రేక్ష కుల ముందుకు రాబోతోంది. పృథ్వీరాజ్‌సుకుమారన్, ప్రియాంకా చోప్రాలు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కొరాపుట్‌ లొకేషన్స్‌లో వేసిన సెట్స్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంక, పృధ్వీరాజ్‌లు పాల్గొనగా, కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

రామాయణం ఆధారంగా…!


కాగా ఈ సినిమా కథనంపై పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ మూవీ రామాయణం ఆధా రంగా రూపొందుతుందనే టాక్‌ వినిపిస్తోంది. రామాయణంలో…లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు… ఆంజనేయుడు సంజీవినిని తీసుకువస్తాడు. ఈ సంజీవిని కోసం ఆంజనేయుడు ఎంతో కష్టపడతాడు. ఇలాంటి స్టోరీలైన్‌తో…ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా ఈ మూవీ వస్తుందనే టాక్‌ వినిపిస్తోంది.

కాశీలో రుద్రగా…?

మరోవైపు ఈ మూవీలో మహేశ్‌బాబు క్యారెక్టర్‌ పేరు ‘రుద్ర’ అనే ప్రచారం జరుగుతోంది. రుద్ర అంటే… శివుడు అని అర్థం. అయితే ఈ సినిమా చిత్రీకరణ కోసం కాశీ నగరాన్ని తలపించే సెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, అక్కడ షూటింగ్‌ చేయాలని రాజమౌళి అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. అంటే..ఈ సినిమా ప్రధానంగా కాశీ నేపథ్యంతో సాగుతుందట. మేజర్‌ షూటింగ్‌ ఈ సెట్‌లోనే జరుగు తుందట. సాధారణంగా రాజమౌళి సినిమాలన్నీ…సెట్స్‌లోనే ఎక్కువ చిత్రీకరణలు జరుపుకుంటాయి… సో..ఇలాంటి సెటప్‌నే…మహేశ్‌బాబు మూవీ కోసం రెడీ చేయుస్తున్నారట రాజమౌళి. అయితే…మహేశ్‌ క్యారెక్టరైజేషన్, రుద్ర పేరు, కాశీ బ్యాక్‌డ్రాప్‌….అన్న అంశాలపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *