Nandamuri Mokshagna Teja: నందమూరి బాలకృష్ణ తనయుడు, నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమా ఎంట్రీ గురించి, నందమూరి ఫ్యాన్స్ అందరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ తేజ తొలి సినిమా ‘హను–మాన్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఖరారైపోయింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మోక్షజ్ఞ. యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. స్పెషల్ మేకోవర్ ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. నందమూరి తేజస్విని (బాలకృష్ణ కుమార్తె) సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత. డిసెంబరు 5 ఉదయం ఈ సినిమా ప్రారంభోత్సవం జరగాల్సింది. కానీ సడన్గా పూజా కార్యక్రమం జరగలేదు. కానీ కట్ చేస్తే ఇప్పుడు సినిమాయే క్యాన్సిల్ అనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి…రాత్రికి రాత్రి ఏం జరిగిందన్న చర్చలు ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి.
Mokshagna Teja: నందమూరి వారసుడు..ఒకే సారి రెండు సినిమాలు
అంతా మంచికే: బాలకృష్ణ
మరోవైపు ఓ కమర్షియల్ ఈవెంట్ కోసం బాలకృష్ణ కాకినాడ వెళ్లారు. అక్కడ మోక్షజ్ఞ సినిమా నిలిచిపోవడం గురించి, ఆయన్ను అడిగారు అక్కడి మీడియా ప్రతినిధులు. మోక్షజ్ఞకు సడన్గా జ్వరం రావడం, అనారోగ్య ం బారినపడటం వల్ల సినిమా పూజా కార్యక్రమం జరగలేదని, ఏం జరిగిన అంతా మన మంచికే అని భావించి ముందుకు వెళ్లాలని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
వరుసగా రెండు సినిమాలు ఆగిపోయాయి…
మరోవైపు ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తన తర్వాతి సినిమాను సెట్స్పైకి తీసుకు వెళ్లడానికి మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్తో ప్రశాంత్ వర్మ చేయాల్సిన ‘అధీర’ ప్రజెంట్ స్టేటస్ ఏంటో స్పష్టత లేదు. మైత్రీమూవీ మేకర్స్ రణ్బీర్కపూర్ హీరోగా ప్రశాంత్ వర్మ ఓ సినిమాకు కమిటైయ్యాడు. ప్రీ ప్రొడక్షన్స్పై పది కోట్లకు డబ్బు ఖర్చయింది. ‘రాక్షస’ అనేది టైటిల్. ఈ సినిమా కూడా సడన్గా ఆగిపోయింది.
ప్రశాంత్ వర్మ నెక్ట్స్ ఫిల్మ్స్
అయితే ప్రస్తుతం ప్రశాంత్వర్మ చేతిలో ‘జై హనుమాన్’ సినిమా ఉంది. ‘కాంతార’ ఫేమ్ రిషబ్శెట్టి, ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. అలాగే ప్రభాస్తో మైత్రీమూవీమేకర్స్తో ప్రశాంత్ వర్మ ఓ సినిమానుచేయాలనుకుంటున్నారు…ఈ రెండు మూవీస్లో ప్రశాంత్ వర్మ ఏ సినిమా చేస్తారో చూడాలి.