RishabShetty: ఛత్రపతిగా కాంతార హీరో రిషబ్‌శెట్టి

Viswa
1 Min Read
Rishab Shetty: మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా చాలా సినిమాలొచ్చాయి. లేటెస్ట్‌గా ‘ది ఫ్రైడ్‌ ఆఫ్‌ భారత్‌: ఛత్రపతి శివాజీ మహారాజ్‌’ పేరిట హిందీలో ఓ సినిమా రానుంది. హిందీలో ‘మేరికోమ్, స్వతంత్రవీర్‌ సవార్కర్, మై అటల్‌ హూ, రౌడీ రాథోడ్‌’ వంటి సినిమాలను నిర్మించిన సందీప్‌ సింగ్‌ ‘ఛత్ర పతి శివాజీ మహారాజ్‌’ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌శెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. ప్రస్తుతం రిషబ్‌శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్‌ ‘కాంతార: ఛాప్టర్‌ 1’తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో రిషబ్‌శెట్టి ‘జైహనుమాన్‌’ సినిమాలో నటిస్తారు. ఆ నెక్ట్స్‌ ‘ఛత్ర పతి శివాజీ మహారాజ్‌’ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. 2027 జనవరి 21న ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.
Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *