సినిమా ప్రపంచంలో ఒకప్పుడు ‘స్పెషల్ సాంగ్స్’ అనగానే కేవలం ఐటమ్ డాన్సర్లు మాత్రమే గుర్తుకువచ్చేవారు. కానీ, ప్రస్తుత ట్రెండ్లో స్టార్ హీరోయిన్లే ఆ బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు. తాజాగా ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్నా ఈ విషయంలో తీసుకున్న ఒక గట్టి నిర్ణయం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చకు దారితీసింది. గతంలో సిల్క్ స్మిత, జయమాలిని, ముమైత్ ఖాన్ వంటి వారు ప్రత్యేక గీతాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేవారు.
అయితే సమంత, తమన్నా వంటి టాప్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్లో మెరవడం మొదలుపెట్టాక, ఈ పాటల స్థాయి, వాటికి లభించే పారితోషికం భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే రష్మిక కూడా తన డ్యాన్స్తో వెండితెరపై మ్యాజిక్ చేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోయిన్లకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఒప్పుకుంటారు. కానీ రష్మిక మాత్రం ఇందుకు భిన్నంగా ఒక కొత్త నిబంధన విధించింది. రష్మిక తనకు అత్యంత సన్నిహితులైన, తన కెరీర్కు పునాది వేసిన ఇద్దరు ప్రత్యేక దర్శకుల చిత్రాల్లో మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని స్పష్టం చేసింది.
కేవలం ఆదాయం కోసం కాకుండా, తనతో మంచి అనుబంధం ఉన్న దర్శకుల కోసమే ఈ మినహాయింపు ఇస్తానని ఆమె తేల్చి చెప్పడం విశేషం. రష్మికకు ఉన్న పాన్-ఇండియా పాపులారిటీని వాడుకోవాలని చూస్తున్న పలువురు మేకర్స్కు ఈ నిర్ణయం మింగుడుపడటం లేదు. రష్మిక ఒక పాటలో కనిపిస్తే సినిమా మార్కెట్ ఈజీ అవుతుందని భావించిన దర్శకులకు ఆమె ‘నో’ చెప్పడం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేస్తే హీరోయిన్గా తనకున్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఇలా సెలెక్టివ్గా ఉండటం రష్మిక తీసుకున్న తెలివైన నిర్ణయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రష్మిక తీసుకున్న ఈ నిర్ణయం ఆమె వృత్తిపరమైన స్పష్టతను తెలియజేస్తోంది. మరి ఆ ఇద్దరు ‘లక్కీ’ డైరెక్టర్లు ఎవరో అనే దానిపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.