మహేశ్‌బాబు మేకిన్‌ ఇండియా

Viswa
2 Min Read
Mahesh and Rajamouli SSMB29

హీరో మహేశ్‌బాబు (Maheshbabu), దర్శకుడు రాజమౌళి (SSRajamouli) కాంబోలో అంతర్జాతీయ స్థాయిలో ఓ మూవీ రానుంది (MaheshBabuSSMB29 new update). ఈ సిని మా షూటింగ్‌ (SSMB29) శరవేగంగా జరుగుతోంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్‌ను ఒడిస్సాలో చేశారు మేకర్స్‌. లేటెస్ట్‌గా మూడో షెడ్యూల్‌ షూటింగ్‌ను హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో చిత్రీ కరించాలని రాజమౌళి అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేశారు.

భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇది. మూడువేల మందికిపైగా ట్రైన్డ్‌ జూనియర్‌ ఆర్టిస్టులు ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌లో పార్ట్‌ కానున్నట్లుగా తెలిసింది. నెల రోజు లకుపైనే, ఈ మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ కొనసాగుతుందని తెలిసింది. బోటు చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇది. ఈ షెడ్యూల్‌తో ఈ మూవీ చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తవుతుందట. చూస్తుంటే..ఈ మూవీ షూటింగ్‌ను అంతా ఇండియన్‌ లోకేషన్స్, సెట్స్‌లోనే కంప్లీట్‌ చేసేలా ఉన్నారు మహేశ్‌బాబు అండ్‌ రాజమౌళి.

ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందు…విదేశాల్లో ఈ మూవీ షూటింగ్‌ ఎక్కువగా జరుగుతుందనే ప్రచారం సాగింది. కేన్యా, ఆఫ్రికా దేశాల్లో లొకేషన్స్‌ను కూడా చూసొచ్చారు రాజమౌళి. కానీ ప్రస్తుతం ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ అంతా ఇండియాలోనే జరుగుతుండటం విశేషం.

దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బడ్జెట్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి… మరో అంతర్జాతీయ స్టూడియో ఏదైనా ఈ మూవీ నిర్మాణంలో భాగం కానుందనే ప్రచారం సాగింది. ఈ విషయంపై ఇప్పటివరకు అప్‌డేట్‌ లేదు.

కాకపోతే….ఈ సినిమాకు మహేశ్‌బాబు, రాజమౌళి పారితోషికం తీసుకోవడం లేదని, వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటారనే టాక్‌ కూడా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బహుశా..అందుకెనెమో… ఖర్చు ఎక్కువగా కాకుండ ఇండియా లోకేషన్స్, సెట్స్‌లోనే ఈ మూవీని పూర్తి చేసి, 2027లోనే ఈ మూవీని రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్‌లు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త. విజయేంద్రప్రసాద్‌ ఈ ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కి కథ అందించారు. విజయేంద్రప్రసాద్, దేవకట్టాలు కలిసి ఈ సినిమాకు సంభాషణలు ఇస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *