సింగీతం శ్రీనివాసరావు ( Director Singeetham Srinivasa Rao) ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చునెమో. ‘పుష్పకవిమానం’ ‘భైరవ ద్వీపం’, ‘అపూర్వ సహోదరులు’, వంటి బ్లాక్బస్టర్ సినిమాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. దాదాపు పధ్నాలుగు సంవత్సరాల తర్వాత, 94 సంవత్సరాల వయసులో ఆయన దర్శ కత్వం వహించిన సినిమా ‘సింగ్ గీతం’. ఈ చిత్రాన్ని ఆయన ఎప్పుడో తీయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు తీయగలిగారు. ‘మహానటి, కల్కి2898ఏడీ’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలను తీసిన, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ‘సింగ్ గీతం’ సినిమాను నిర్మించారు. ‘జాతిరత్నాలు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత, నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా ఇది. మరి..ఈ ‘సింగ్ గీతం’ సినిమా (Sing Geetham Cinema Review) ప్రేక్షకులను ఏ మాత్రం అలరించగలిగిందో ఓ లుక్ వేద్దాం.
- Sing Geetham Story: కథ
- విశ్లేషణ
- Sing Geetham Cast and Crew: నటీనటుల పెర్ఫార్మెన్స్
- ఫైనల్గా: ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి సందేశాత్మక చిత్రం ఇది. అప్పుడప్పుడు ఈ తరహా సినిమాలు కూడా రావాలి. మనుషుల్లో ఉన్న మాన వత్వం, మంచితనాం ఉనికిని గుర్తుచేయాలి. అలాగే పర్యావరణం పరిరక్షణ బాధ్యతను మరువ కూడదని, భావితరాలకు మనం ఇచ్చే అసలు సిసి లు ఆస్థి అదేనని గుర్తుపెట్టుకోవాలి.
సినిమా: సింగ్ గీతం (Sing Geetham Review)
ప్రధాన తారాగణం: అయాన్, అహల్యబమ్రూ, షాలిని కొండెపూడి, పీఏ తులసీ, బెనర్జీ, శివన్నారాయణ, అగు స్టాన్లీ
దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు (Sing Geetham Cinema Director)
సమర్పణ: అశ్వినీదత్
నిర్మాత: నాగ్ అశ్విన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీ: జూన్ 12, 2026
నిడివి: 2 గంటల 17 నిమిషాలు
రేటింగ్: 2.75/5 (Sing Geetham Cinema Review and Rating)
Sing Geetham Story: కథ
కుబేరపురం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కుబేరపురంలో ‘కుబేర గోల్డ్మైన్స్’ యజమాని రేణు (షాలిని కొండేపూడి). కుబేరపురంలో బంగారం కోసం మైనింగ్ చేయిస్తుంటుంది. ఈ మైనింగ్ వ్యాపారం లాభసాటిగా లేదని, నైరోభికి చెందిన స్వహిలీ (అగు స్టాన్లీ)కి ఈ మైనింగ్ కంపెనీని వంద కోట్లకు అమ్మేసి, విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటుంది షాలిని. అయితే ఈ ‘కుబేర గోల్డ్ మైన్స్’ కు షాలిని ఒక్కతే యజమాని కాదు. ప్రతాప్ సహ–యజమాని. దీంతో డీల్ పూర్తి కావాలంటే పేపర్స్పైప్రతాప్, రేణు…ఇద్దరి సంతకాలు కావాలని స్వహిలీ పట్డుపడతాడు. కానీ ప్రతాప్ సంతకం
చేసేందుకు ఒప్పుకోడు. దీంతో ప్రతాప్, రేణు ఇద్దరు కలిసి గోల్డ్ మైనింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ మైనింగ్ సజావుగా సాగేందుకు ఓ పెద్ద చెట్టును తొలగించాల్సి వస్తుంది. ఈ చెట్టును తన చిన్నప్పట్నుంచి అపూరూపంగా చూసుకుంటున్న గౌరి (అహల్య) ఇందుకు ఒప్పుకోదు. అయినా సరే ఆ చెట్టును కొట్టేస్తారు. ఆ కోపంలో కుబేరపురం గ్రామస్థులు ఇబ్బందులు పడాలని, ఆ కుబేరస్వామిని అహల్య అడుగుతుంది. దీంతో ఆమరుసటి రోజునుంచే, ఆ కుబేరపురం గ్రామస్థుల మాటలు పాటలు అయిపోతాయి. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? కుబేరపురం గ్రామ ప్రజలకు శాప విమోచనం ఎలా జరిగింది? ఆ చెట్టుకు ప్రతాప్కు ఉన్న కనెక్షన్ ఏమిటి? స్వహిలీ డీల్ సజావుగా పూర్తయిందా? అన్నది మిగిలిన సినిమా కథ. థియేటర్స్లో చూడాలి.
విశ్లేషణ
స్వార్థం రాజ్యమేలుతున్న ఈ కలికాలంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. మనుషులు తమ సౌకర్యాల కోసం ఏ స్థాయికైనా దిగజారేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే తమ స్వార్థ ప్రయోజనాలకోసం భావితరాలకు కూడబెట్టాల్సిన ప్రకృతి సంపదను తాత్కాలిక సుఖ–సౌకర్యాల కోసం నాశనం చేస్తు న్నారు. ఇలాంటివి తగవని, తనదైన శైలిలో చెప్పారు దర్శకులు సంగీతం. దేవుడి భయం మాటున మంచి సందేశం ఇచ్చారు. మానవ సమాజంలో మనవత్వం మనుగుడ అవసరాన్ని మరోమారు గుర్తు చేశారు.
‘సింగ్ గీతం’..మొదట్నుంచి ‘మాటలే పాటలైతే..’ అదే ఈ సినిమా అంటూ మొదట్నుంచి మూవీ టీమ్ ప్రచారం చేసింది. కానీ ‘మాటలే పాటల’ కాన్సెప్ట్ సినిమా అంతా సాగదు. మేజర్ పార్ట్ అయితే ఇదే.

ప్రతాప్ తన సొంత ఊరు కుబేరపురంకు రావడం, గ్రామంలో ఉన్న చివరి చెట్టును కొట్టేయడం, ఊరి ప్రజలకు చెడు జరగాలని గౌరి కోరుకోవడం, గౌరి వెళ్లిన గుహాలోకే ప్రతాప్ వెళ్లడం వంటి సీన్స్తో తొలి భాగం ముగుస్తుంది. బంగారం కోసం రంగులు మార్చే మనిషి తీరు, మనిషిలో మానవ త్వాన్ని వెలికితీసే సన్నివేశాలతో సెకండాఫ్ సాగుతుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ భావోద్వేగభరితంగా ఉంటూనే, ఆడియన్స్ను థ్రిల్ చేస్తుంది. క్లైమాక్స్ కూడా తెలుగు ప్రేక్షకులు ఇష్టపడేట్లుగానే బాగానే కుదిరింది.
కానీ కథాగమనంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లుగా తోచింది. గుహాలో పడ్డ గౌరి ఎలా బటయకు రాగలిగింది? గౌరి శాపనార్థాల్లో కొన్నే ఎందుకు నిజం అయ్యాయి? అన్న కొన్ని సందేహాలు తలెత్తు తాయి. అలాగే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ను ఒక్క పాటకే కుదించడం నప్పలేదు. తొలిభాగంలో సాగదీత
ధోరణి కనిపించింది. కొన్ని రోటీన్ సన్నివేశాలు ఉన్నాయి. సెకండాఫ్లో కథ క్లైమాక్స్కు చేరుకుంటున్న తరుణంలో, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ప్రేక్షక పాత్రలవరకే పరిమితం అయ్యాయి. అలాగే ఇలాంటి కథనం, ఈ తరం జెన్ జీ ఆడియన్స్కు ఏంత మేరకు కనెక్ట్ అవుతాయి? అన్నది కూడా ప్రశ్నార్థకమే.
Sing Geetham Cast and Crew: నటీనటుల పెర్ఫార్మెన్స్
(Sing Geetham Movie cast and crew) అయాన్కు (SingGeetham Cinema Hero) నటుడిగా ఇది తొలి సినిమా. తన తొలి ప్రయత్నంలోనే అయాన్ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో యాక్టర్గా మెరుగుపడాల్సిన అసవరం ఉంది. ఇక నెగటివ్ షేడ్స్ ఉన్న రేణు పాత్రలో షాలిని బాగానే యాక్ట్ చేశారు. తెరపై గంభీరంగా కనిపించిన ఈ పాత్ర, చివర్లో తేలిపోయినట్లుగా అనిపించింది. ఇక గౌరి పాత్రలో అహల్య (SingGeetham Cinema Heroine) నటన చూడచక్కగా ఉంది. ప్రేమ, కోపం, భావోద్వేగం, కామెడీ..అన్ని కలగలిపిన యాక్టింగ్ చూపిం చారు. గౌరి పాత్ర రూపంలో అహల్యకు మంచి యాక్టింగ్ చేసే స్కోప్ లభిం చింది. పీఏ తులసీ, బెనర్జీ, రాహుల్ రవీంద్రన్, నివేతా, వంశీ వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. బెనర్జీ, రాహుల్ రవీంద్రన్లను విలన్స్గా చూపించారు. ఇక సినిమా క్లైమాక్స్లో విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పీయరెన్స్, స్టార్టింగ్లో సుబ్బారావుగా కేవీ అనుదీప్ గెస్ట్ రోల్ ఆడియన్స్కు కాస్త రిలీఫ్గా అనిపిస్తాయి.
ఇక టెక్నికల్గా ఈ సినిమా బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం, హీరో అంతటి స్థాయి ఇవ్వదగ్గ మనిషి దేవిశ్రీప్రసాద్. ఆయన సంగీతం ఈ సిని మాకు ప్రాణం పోసింది. ఆయువుపట్టులా నిలిచింది. అయితే ఒకట్రెండు దేవీ పాత సినిమాల పాటలు అలా ఫ్లోలో వచ్చేశాయా? అని వినిపిం చవచ్చు. నాగ్ అశ్విన్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. విజువల్స్ బాగున్నాయి.