హీరో రామ్ చరణ్ కి అరుదైన గౌరవం లభించింది. లండన్ లోని మెడమ్ తుసాడ్స్ మ్యూజియం లో రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సెలెబ్రేషన్స్ కు చిరంజీవి, రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల హాజరైయ్యారు. చిరంజీవి, రాంచరణ్ లు కొంత కాలం తర్వాత ఒకే వేడుకలో పాల్గొనడం తో ఆ వేడుకలో సందడి నెలకొనింది.
ప్రస్తుతం రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లో ఆవిష్కరణ జరిగినప్పటికి, ఈ విగ్రహం లండన్మెడమ్ తుసాడ్స్ మ్యూజియంలో ఉండదు. సింగపూర్ లోని మెడమ్ తుసాడ్స్ మ్యూజియంకి రామ్ చరణ్ మైనపు విగ్రహం ను తరలిస్తారు. సింగపూర్ లోని మేడమ్ తుసాడ్స్ మ్యూజియం లో తొలిసారి ప్రభాస్ మైనపు విగ్రహం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో మహేష్ బాబు ప్రతిమను ఉంచారు. అక్కడే శ్రీదేవి, కాజోల్ ల మైనపు విగ్రహం లు కూడ ఉన్నాయి.
ఇక సినిమా ల విషయాన్ని కి వస్తే రామ్ చరణ్ ప్రెజెంట్ పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చి బాబు ఈ సినిమా కు డైరెక్టర్. జాన్వీ కపూర్ హీరోయిన్. వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్డే సందర్బంగా పెద్ది సినిమా ను మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా చేస్తాడు రామ్ చరణ్. రంగస్థలం వంటి హిట్ మూవీ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పై ఇండస్ట్రీ లో అంచనాలు ఉన్నాయి. ఈ ఎడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ కావొచ్చు.