మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు. ఈ ‘వారణాసి’ సినిమాను (Varanasi release date) 2027 మార్చి 7న (Varanasi Movie Official release date) రిలీజ్ చేయనున్నట్లుగా జనవరి 30న అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు పైగా లొకేషన్స్లో ఈ ‘వారణాసి’ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు (Varanasi April 7 2027)
https://x.com/urstrulyMahesh/status/2017183532704211432?s=20
ఉగాది, శ్రీరామనవవి పండగలతో పాటుగా, లాంగ్ వీకెండ్ కలిసి వచ్చేలా, 2027లో ఓ మంచి రిలీజ్ డేట్ను ‘వారణాసి’ టీమ్ సెట్ చేసుకుంది. అనుకున్నట్లుగా ఈ తేదీకి రాజమౌళి ‘వారణాసి’ సినిమా విడుదల అయితే, సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు నమోదుకాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో మహేశ్బాబు విభిన్నమైన గెటప్స్ కనిపిస్తారు. అందులో ఒకటి రాముడి పాత్ర. మహేశ్బాబు ఈ సినిమాలో రాముడి గెటప్లో కనిపిస్తున్నారు కనుక, ఈ సినిమాను శ్రీరామ నవవి సందర్భంగా రిలీజ్ కాబోతుంది కనుక, ఆడియన్స్కు ఇది మంచి విజువల్ఫీస్ట్లా ఉంటుంది. ఒక రామయాణ సినిమాలోని ఓ ముఖ్య సంఘటనను ఆధారంగా చేసుకుని, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఆల్రెడీ యూనిట్ ప్రకటించింది.

ఈ ఫారెస్ట్ యాక్షన్ అండ్ మైథలాజికల్ అడ్వెంచరస్ సినిమాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, ప్రకాష్రాజ్, ప్రుథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. మహేశ్బాబు- ప్రియాంకా చోప్రా పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్లో విదేశాల్లో జరగనుందని తెలిసింది. అంటార్కిటికా దేశంలో వారణాసి సినిమా షూటింగ్ను ప్లాన్ చేశారట ‘వారణాసి’ యూనిట్. ఇదే నిజమైతే, అంటార్కిటిక లోకేషన్లో షూటింగ్ జరుపుకునే తొలి భారతీయ చిత్రం ‘వారణాసి’యే అవుతుంది. ఇక ఈ సినిమాలో రుద్ర పాత్రలో మహేశ్బాబు, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో ప్రుథ్వీరాజ్సుకుమారన్ నటిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.