Dhorikindha Movie opening: హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘దొరికిందా’ (Dhorikindha Movie opening) సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అశోక్కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రెబల్స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిక్లాప్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత పద్మిని నాగులపల్లి యూనిట్కు స్క్రిప్ట్ అందించారు. సడ్లపల్లివెంకటేష్ రెడ్డి, అశ్వద్ధ రాయల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాక్ దర్శకత్వం వహిస్తుండగా, పీడీఆర్ ప్రసాద్రెడ్డి ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సడ్లపల్లి వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ- ”ఈ చిత్రానికి ఫ్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించిన మా అమ్మ శ్యామలాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. మా చిత్రం “దొరికిందా” మంచి కమర్షియల్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో పాత కొత్త నటీనటులు నటించనున్నారు . ఈ చిత్రంలోని నటీనటులు-సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేస్తాను” అని చెప్పారు.