Rowdy Janardhana postponedవిజయ్దేవరకొండ ప్రజెంట్ మూడు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి…‘రణబాలి’. రెండు..‘రౌడీ జనార్ధన’..మూడు..హాయ్నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్లో సినిమా.
‘రణబాలి’ సినిమా ఈ సెప్టెంబరు 11న రిలీజ్ కానున్నట్లు గతంలో రిలీజ్ డేట్ ప్రకటించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో, మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా హీరోయిన్.
‘రౌడీ జనార్థన’ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్నారు. కీర్తీ సురేష్ హీరోయిన్. ఈ సినిమాను డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. ఇంతవరకు బాగానే ఉంది…
కానీ..అక్షయ్కుమార్ హీరోగా, విద్యాబాలన్, రాశీఖన్నా హీరోయిన్లుగా, ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిందీ రీమేక్ సినిమాను డిసెంబరు 4న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
డిసెంబరు 4 అనేది ‘రౌడీ జనార్ధన’ సినిమా కోసం ‘దిల్’ రాజు, శిరీష్లు ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడు ఇదే టైమ్లో అక్షయ్కుమార్ సినిమా రిలీజ్ను ప్లాన్ చేశారు. దీంతో ‘రౌడీ జానర్ధన’ సినిమా ఈ ఏడాది రాకపో వచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
డిసెంబరు 4న అక్షయ్కుమార్ సినిమా వచ్చి, డిసెంబరు 12న రౌడీ జనార్థన సినిమా వచ్చే అవకాశాలు తక్కువ. ఒకే బ్యానర్ నుంచి వారం వ్యవధిలో రెండు సినిమాలంటే..ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త డేరింగ్ స్టెప్ అనే చెప్పవచ్చు. మరి..ఏం జరుగుతుందో చూడాలి.